News January 23, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.
Similar News
News February 21, 2026
రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 21, 2026
T20WC: భారీ వర్షం.. మ్యాచ్ రద్దు

కొలంబో: సూపర్-8లో న్యూజిలాండ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైంది. టాస్ పడిన కాసేపటికే వాన మొదలు కాగా ఇప్పటి వరకు తగ్గుతుందేమో అని వేచి చూశారు. ప్రస్తుతం వర్షం మరింత పెద్దది కావడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టీమ్లు చెరొక పాయింట్ పంచుకోనున్నాయి. అటు రేపు పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక, అహ్మదాబాద్లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.
News February 21, 2026
6 రాష్ట్రాల్లో SIR పూర్తి.. గుజరాత్లో 68 లక్షల ఓట్లు తొలగింపు

దేశంలోని 6 రాష్ట్రాలు/UTలలో SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పూర్తిచేసినట్లు EC వెల్లడించింది. వివిధ కారణాలతో అత్యధికంగా గుజరాత్లో 68.12L ఓట్లను తొలగించినట్లు తెలిపింది. MPలో 34.25L, రాజస్థాన్లో 31.36L, ఛత్తీస్గఢ్లో 24.99L, కేరళలో 8.97L, గోవాలో 1.27L, అండమాన్&నికోబార్లో 52K, పుదుచ్చేరిలో 77K, లక్షద్వీప్లో 206 ఓట్లను తీసివేసినట్లు పేర్కొంది. WB, TN, UP డేటాను ఈ నెలాఖరులో విడుదల చేస్తామంది.


