News April 8, 2024

ముగిసిన మూల్యాంకణం: డీఈఓ

image

అనంతపురం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1.81 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. డీఈఓ వరలక్ష్మి పర్యవేక్షణలో 1వ తేదీ నుంచి అన్ని వసతులు కల్పించారు. డీఈఓ మాట్లాడుతూ.. అందరి సమష్ఠి కృషితోనే జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు, మూల్యాంకన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News October 4, 2025

యాడికి: బాలిక అదృశ్యంపై కేసు నమోదు

image

యాడికి మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు శుక్రవారం రాత్రి సీఐ వీరన్న తెలిపారు. విద్యార్థిని యాడికిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం బస్సులో స్కూల్‌కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. బాలిక తండ్రి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 4, 2025

అమృత్ పనులు వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్

image

అమృత్ పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ వద్ద అమృత్ పథకం పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై పబ్లిక్ హెల్త్, నగర పాలక సంస్థ, టిడ్కో అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. మొదటి దశ పనులు నెల రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 3, 2025

‘చెరువులకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి’

image

జిల్లాలో 301 చెరువులకు నీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఎల్‌సీ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్ఎస్ఎస్ఎస్, హెచ్ఎల్‌సీ కింద ఉన్న చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.