News April 8, 2024

ముగిసిన మూల్యాంకణం: డీఈఓ

image

అనంతపురం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1.81 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. డీఈఓ వరలక్ష్మి పర్యవేక్షణలో 1వ తేదీ నుంచి అన్ని వసతులు కల్పించారు. డీఈఓ మాట్లాడుతూ.. అందరి సమష్ఠి కృషితోనే జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు, మూల్యాంకన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 14, 2025

కేఎల్ స్వామి దాస్‌కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

image

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.