News April 16, 2024

ముగ్గురు వ్యక్తులు.. 5 వెహికిల్స్‌కే ఛాన్స్: కలెక్టర్

image

మార్చి 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్లు 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ప్రతిరోజు రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ స్వీకరిస్తామని అన్నారు. నామినేషన్ వేసేటప్పుడు ముగ్గురు వ్యక్తులను, ఐదు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అన్నారు.

Similar News

News October 7, 2025

భీమవరం: ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేత

image

జిల్లాలో అక్షరాంద్ర ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం పీజిఆర్ఎస్‌లో గత సంవత్సరం నిర్వహించినటువంటి ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంలో ఉత్తీర్ణులైన వారికి భీమవరంలో సర్టిఫికెట్లను అందించారు. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు.

News October 7, 2025

రుణాలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన డీఆర్‌డీఏ, పశుసంవర్ధక శాఖలపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కింద జిల్లాకు 1,419 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ (SHG) మహిళలు ఈ యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని సూచించారు. స్వయం సహాయక బృందాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News October 7, 2025

రేపు పెదఅమిరం రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడినుంచి పెదఅమిరం చేరుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.