News March 15, 2025

ముత్తిరెడ్డి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం

image

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో అయ్యప్ప టెంట్ హౌజ్ ఆవరణలో శుక్రవారం క్షుద్ర పూజల కలకలం రేగింది. గుర్తు తెలియని వారు టెంట్ హౌజ్ ఆవరణలో ఒక ఎర్ర బట్టలో పసుపు, ఎల్లిగడ్డ లాంటి పదార్థాలు వదిలి వెళ్లారు. గమనించిన స్థానికులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని విషయాలపై అరా తీశారు.

Similar News

News February 28, 2026

పెద్దపల్లి: దానాపూర్‌కు హోలీ స్పెషల్ ట్రైన్

image

చర్లపల్లి-దానాపూర్ మధ్య హోలీ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు SCR అధికారులు పేర్కొన్నారు. రైలు నం.07097 నేడు 20:30 గంటలకి చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట, రామగుండం, బల్హర్షా, నాగపూర్, ప్రయాగ్రాజ్ మీదుగా మార్చి 2న ఉదయం 9:30గంటలకు దానాపూర్ చేరుతుందన్నారు. అదే రోజు ఉదయం 11:30గంటలకు దానాపూర్ నుండి రైలు నం.07098 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:45కి చర్లపల్లి చేరుతుందన్నారు. రామగుండంలో ఈ ట్రైన్ ఆగుతుంది.

News February 28, 2026

జగిత్యాల: ‘పుష్కరాల పనులకు మార్పులు చేర్పులు చేపట్టాలి’

image

త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు అధికారులు తయారుచేసిన పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు నిధులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్లు మంత్రి అన్నారు. గతంలో 50 లక్షల మంది భక్తులకు పుణ్య స్థానాలకు ఏర్పాటు చేశారని, కానీ 2027 పుష్కరాలకు నాలుగు కోట్ల భక్తులకు ఏర్పాటు చేయాలని తెలిపారు.

News February 28, 2026

HYD: సౌండ్ వద్దు.. Midnight Silence ముద్దు!

image

పబ్బుల హోరు.. DJల జోరు వదిలేసి హైటెక్ సిటీ Gen Z ‘నిశ్శబ్దాన్ని’ వెతుక్కుంటోంది. అర్ధరాత్రి దాటాక గచ్చిబౌలి సర్వీస్ రోడ్ల మీద కార్లు ఆపి ఎటువంటి సౌండ్ లేకుండా కేవలం ఆకాశాన్ని చూస్తూ గడపడం కొత్త ట్రెండ్. దీని పేరు కార్ పార్కింగ్ థెరపీ. ఒత్తిడిని జయించడానికి మందు అవసరం లేదు. మెట్రో రైలు శబ్దం వింటూ కారులో కునుకు తీస్తే చాలు అంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ అర్బన్ సన్యాసులకు ఇదే ప్రశాంతంగా ఉందట.