News October 15, 2024
ముత్యాలం పాలెం బీచ్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

అనకాపల్లి పరవాడ మండలం ముత్యాలపాలెం బీచ్లో గుర్తుతెలియని మృతదేహం ఒకటి నేడు లభ్యమైంది. మృతదేహం పూర్తిగా అస్థిపంజరాలుగా మారింది. మృతుడి ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా, ఫ్లై ఈగల్ పచ్చబొట్టు చేతిపై ఉంది. సంఘటన స్థలానికి పరవాడ పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పచ్చబొట్టు ఆధారంగా మృతుని బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు.
Similar News
News September 20, 2025
ఏయూలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో MA, Mcom, MSC కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకుడు డి.ఏ.నాయుడు తెలిపారు. ఈనెల 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 26వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ పీజీ సెట్లో ర్యాంక్ సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫీజులు, కోర్సులు, తదితర వివరాలను వెబ్సైట్ నుంచి పొందవచ్చు.
News September 20, 2025
విశాఖ: కరెంట్ షాక్తో వ్యక్తి మృతి

విశాఖలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. చెంగల్రావుపేటకు చెందిన బెహరా అబ్బాయి (65) ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా, ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. ఈ ఘటనలో ఆయన చేతులు, శరీరంపై పలుచోట్ల కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 20, 2025
25న ఎంవీపీ కాలనీలో తపాలా డాక్ అదాలత్

తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఎంవీపీ కాలనీ రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ లోపు రీజనల్ కార్యాలయం చిరునామాకు సమర్పించాలని అధికారులు తెలిపారు.