News February 24, 2025
ముదినేపల్లి కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్

ఏలూరు జిల్లాలో ఓ ప్రిన్సిపల్పై వేటు పడింది. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జాస్మిన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జనవరి 4న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆ రోజు ఆమె వ్యవహరించిన తీరుపై కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి సాల్మన్ రాజు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శారద ఉత్తర్వులిచ్చారు.
Similar News
News July 5, 2025
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైరబోయిన వెంకటేశ్వర్లు (36) రాత్రి పీర్ల ఊరేగింపులో ఉండగా ప్రత్యర్థులు గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. అయితే హత్యకు గురైన వ్యక్తి సుమారు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కూడా హత్యకు గురయ్యాడు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
News July 5, 2025
సిద్దిపేట: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గజ్వేల్ పాత సయ్యద్ హాసిమ్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
News July 5, 2025
రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కి తరలించారు.