News February 24, 2025

ముదినేపల్లి కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్

image

ఏలూరు జిల్లాలో ఓ ప్రిన్సిపల్‌పై వేటు పడింది. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జాస్మిన్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జనవరి 4న  డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆ రోజు ఆమె వ్యవహరించిన తీరుపై కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి సాల్మన్ రాజు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శారద ఉత్తర్వులిచ్చారు.

Similar News

News September 17, 2025

ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్.. APPLY

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తారు. SHARE IT.

News September 17, 2025

HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

image

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.

News September 17, 2025

అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదు: మోదీ

image

పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలు ప్రదర్శించి భారత్‌లో విలీనం చేశారని చెప్పారు.