News January 30, 2025

ముద్దోల్: జాతీయస్థాయి రామన్ అవార్డు పోటీలకు ఎంపిక

image

తానూర్ మండలంలోని బోసి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్యాముల్వార్ అభిజ్ఞ, చాదల ప్రవీణ్ కుమార్ జాతీయ స్థాయి రామన్ అవార్డు ( ఫైనల్) పోటీలకు ఎంపికైనట్లు గైడ్ టీచర్ సుధాకర్ తెలిపారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో బెంగళూరులో నిర్వహించే ఫైనల్స్‌లో విద్యార్థులు పాల్గొంటారన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను డీఈవో రామారావు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News January 10, 2026

రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా పెద్దకడబూరు పీఎస్

image

పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా ఎంపికైంది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హారీశ్ కుమార్ గుప్తా నుంచి డీఐజీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ భార్గవి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నారు. నేర నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారంలో చూపిన ప్రతిభకు కేంద్ర హోం శాఖ ఈ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని డీఐజీ పేర్కొన్నారు.

News January 10, 2026

ఈనెల 13న హనుమకొండలో ఉద్యోగ మేళా

image

ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం ఈనెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనా శాఖ అధికారి బి.సాత్విక తెలిపారు. సుమారు 75 ప్రైవేట్ ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 21 నుంచి 45 ఏళ్ల యువత అర్హులని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత ధృవపత్రాలతో ములుగు రోడ్డు వద్ద గల తమ కార్యాలయంలో జరుగే మేళాకు హాజరు కావాలన్నారు.

News January 10, 2026

సూర్యాపేట: రైతు ఇంట్లో ప్రేమ పక్షుల ముచ్చట!

image

మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగవుతున్న తరుణంలో.. పక్షుల మధ్య అపారమైన అనురాగం చూపరులను ఆకట్టుకుంది. సూర్యాపేట జిల్లా ముక్కుడుదేవులపల్లిలో రైతు మల్లేష్ ఇంట్లోని చెట్టుపై శనివారం సాయంత్రం పక్షులు ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్న అరుదైన దృశ్యం కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి గ్రామస్థులు మంత్రముగ్ధులయ్యారు. ప్రకృతిలోని ఈ అందమైన అనుబంధాన్ని పలువురు తమ చరవాణిల్లో ఆసక్తిగా చిత్రీకరించారు.