News February 21, 2026
మునుగోడు: యజమాని మృతి.. శ్మశానం వద్దే వేచిచూస్తున్న కుక్క!

మునుగోడు మండలం కిష్టాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన మనుషుల మధ్య బంధాలకంటే మూగజీవాల విశ్వాసం గొప్పదని మరోసారి నిరూపించింది. తనను ప్రాణప్రదంగా చూసుకున్న యజమాని పార్వతమ్మ మరణాన్ని ఆ కుక్క తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలు ముగిసినా, మండుటెండలో శ్మశానం వద్దే ఉండిపోవడం ఆ మూగజీవికి ఉన్న అనురాగానికి నిదర్శనం. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
Similar News
News February 21, 2026
నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.
News February 21, 2026
నల్గొండ: పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: కలెక్టర్

జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
News February 21, 2026
నల్గొండ: పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: కలెక్టర్

జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.


