News August 14, 2025
మున్నేరు ఉప్పొంగడంతో రాకపోకలు బంద్

ముదిగొండ మండలం పరిధిలోని పండ్రేగుపల్లి నుంచి రామకృష్ణాపురం దారిలో మున్నేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి తులసీరామ్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో ప్రజల భద్రతకు తాము పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Similar News
News August 14, 2025
ఖమ్మం: ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. సత్తుపల్లి జేవియర్ ప్రభుత్వ కళాశాలలోని అంబేడ్కర్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ పూర్ణచందర్రావు ఈ విషయాన్ని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, ఓపెన్ ఇంటర్, లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. అలాగే, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజులను ఈ నెల 20లోపు చెల్లించాలని ఆయన సూచించారు.
News August 14, 2025
జేవీఆర్, కిష్టారం ఓసీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఓసీలలో బొగ్గు ఉత్పత్తి, ఓబీలు నిలిచినట్లు పీవోలు ప్రహ్లాద్, నరసింహారావు తెలిపారు. Jvr OCPలో 68 mm వర్షపాతం నమోదవగా.. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.20 లక్షల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి. అదేవిధంగా Kistaramఓసీలో 6 వేల టన్నుల బొగ్గోత్పత్తి, 30 వేల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి.
News August 14, 2025
ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఖమ్మం జిల్లాలో జరిగే పర్యటనను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసినట్లు చెప్పారు. పాలేరు, మధిర, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో గురువారం పర్యటన ఖరారు కాగా తాత్కాలికంగా రద్దు చేశారు.