News February 2, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మెదక్‌‌లో కాంగ్రెస్ బోణీ

image

మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. 32వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గోదల మానస సాయిరాం రెండవసారి ఏకగ్రీవమైంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన గోదల జ్యోతి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో మానస ఏకగ్రీవమయ్యారు. మానస 2020లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మానస వరుసగా రెండుసార్లు ఏకగ్రీవం కావడం విశేషం.

Similar News

News February 11, 2026

రామాయంపేట: తొలి ఓటుతో బాధ్యత చాటిన స్మిత

image

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామాయంపేటలోని 4వ వార్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో యువతి స్మిత తన తొలి ఓటు హక్కును వినియోగించుకుంది. మొదటిసారి ఓటు వేయడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన ఈ శక్తివంతమైన హక్కును ప్రతి యువతీ యువకులు బాధ్యతగా వినియోగించుకోవాలని కోరింది. యువ ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

News February 11, 2026

మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.

News February 10, 2026

మెదక్: 686 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలటీల పరిధిలో బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. 74 వార్డులు, 148 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 686 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 17 రూట్లలో మొబైల్ పార్టీ, సీఐల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్, నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు.