News April 1, 2026

మున్సిపాలిటీలలో కౌన్సిలర్ స్థానాల పెంపు

image

రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వుల మేరకు కొన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాలు పెంచారు. ఆదోనిలో 42 స్థానాల నుంచి 52, గూడూరులో 20 నుంచి 23, ఎమ్మిగనూరులో 35 నుంచి 44, డోన్‌లో 32 నుంచి 36కు పెరిగాయి. జనాభా పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. మున్సిపల్ పరిపాలన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News April 20, 2026

9 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు

image

రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద 8 మందికి ఆఫీస్ సబార్డినేట్, ఒకరికి జూనియర్ అసిస్టెంట్‌గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నియామక ఉత్తర్వులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్ఓ చిరంజీవి పాల్గొన్నారు.

News April 20, 2026

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం: కలెక్టర్ డా.సిరి

image

ఆపద సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ డా.సిరి కొనియాడారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కర్నూలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరికరాల ప్రదర్శనను ఆమె తిలకించారు. అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉంటూ ప్రాణ ఆస్తి నష్టాలను నివారించాలని కలెక్టర్ సూచించారు.

News April 20, 2026

కర్నూలు: కాలువలో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆరేళ్ల బాలిక రక్షిత మృతి చెందడం విషాదాన్ని నింపింది. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి అదృశ్యం కాగా, ఆదివారం గ్రామ సమీపంలోని LLC కాలువలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. తమ గారాల పట్టి మరణంతో తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.