News February 13, 2026
మున్సిపోల్స్: కరీంనగర్లో బీజేపీలోకి ఇద్దరి చేరిక

TG: కరీంనగర్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 13వ డివిజన్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్లో విజయం సాధించిన ఏఐఎఫ్బీ అభ్యర్థి విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 సీట్లు ఉండగా బీజేపీ 30 సీట్లు గెలిచింది. తాజాగా ఇద్దరి చేరికతో ఆ పార్టీ బలం 32కి చేరింది.
Similar News
News February 14, 2026
కవలలకు పేర్లు.. రామ్ చరణ్ దంపతులకు చిరు ప్రశంసలు

కవలలకు అన్వీరా దేవి, శివరామ్ అనే పేర్లు పెట్టడంపై రామ్ చరణ్-ఉపాసనను చిరంజీవి అభినందించారు. ఈ పేర్లు ఎంతో బాగున్నాయంటూ బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ‘‘సంస్కృతి, ఆధ్యాత్మికతను మేళవించేలా పేర్లు ఉన్నాయి. చరణ్ తన నానమ్మ అంజనా దేవి పేరు నుంచి ‘దేవి’ని అన్వీరాలో జత చేయడం నా హృదయాన్ని తాకింది. దేవుడి ఆశీర్వాదాలు మీపై ఎప్పటికీ ఉంటాయి’’ అని SMలో పోస్టు చేశారు.
News February 14, 2026
T20WC: ఒమన్ ఘోర ఓటమి

కొలంబో వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఒమన్ ఘోర ఓటమి చవిచూసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 18 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ కలీమ్(50), మిర్జా(46) రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్ 3 వికెట్లు తీశారు. 51 బంతుల్లోనే 10 ఫోర్లు 4 సిక్సులతో 94 పరుగులు చేసిన ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
News February 14, 2026
ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్ ఏర్పాటు

APPSC 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. CID చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యుడిగా CID SP కె.చక్రవర్తిని నియమించింది. దర్యాప్తు విషయంలో అన్ని అధికారాలు సిట్కు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 16లోగా సిట్ తన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.


