News September 6, 2025
ముమ్మిడివరం: రూ.30 కోట్లతో జంప్

చిట్టీల పేరిట మురముళ్లలో రూ.30 కోట్లతో ఓ కేటుగాడు జంప్ అయ్యాడు. ఐ.పోలవరం(M) పశువుల్లంకకు చెందిన చింతలపూడి వీరా శంకరరావు మురముళ్ల కేంద్రంగా 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ నమ్మకంగా ఉండేవాడు. ఇటీవల కాకినాడలో కొన్ని ఆస్థులను కొని పరారయ్యాడు. కొద్ది రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్, ఇంటికి తాళం వేసి ఉండడంతో దాదాపు 100 మంది బాధితులు ఎమ్మెల్యే బుచ్చిబాబు, పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News September 6, 2025
జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
News September 6, 2025
జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
News September 6, 2025
BREAKING: CBI డైరెక్టర్ ప్రవీణ్కు అస్వస్థత

TG: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి HYD వస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా కాళేశ్వరం, న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులను విచారించేందుకే ఆయన హైదరాబాద్ వచ్చారని వార్తలు వస్తున్నాయి.