News February 12, 2025
ములకలచెరువు: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357903005_52025345-normal-WIFI.webp)
రోడ్డుప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె ప్రశాంతనగర్కు చెందిన భార్యాభర్తలు, పిల్లలు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రమాదంలో నాలుగు ప్రాణాలు పోవడం తీరని విషాదం. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. డ్రైవింగ్ చేసే ముందు మనకూ ఒక కుటుంబం ఉందని గుర్తించండి.
Similar News
News February 12, 2025
HYD: వేధింపులు.. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని మృతి (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739369753517_705-normal-WIFI.webp)
ఫీజు కట్టాలని వేధింపులు తాళలేక మేడ్చల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అఖిల మంగళవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అఖిల చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇదే విషయమై పలువురు పాఠశాల యాజమాన్యం వైఖరిపై మండిపడుతున్నారు.
News February 12, 2025
ధరూర్: ఏసీబీ కోర్టులో ఎస్ఐ.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365189383_20512937-normal-WIFI.webp)
ఏసీబీకి చిక్కిన ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్పై రిమాండ్ అనంతరం పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకోనుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ మంగళవారం ఓ కేసు వ్యవహారంలో రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్తో సహా ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ను, డ్రైవర్ను హాజరుపరిచారు.
News February 12, 2025
మందమర్రి PHCని సందర్శించిన DMHO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365028483_50225406-normal-WIFI.webp)
మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గదులతో పాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోనే ఉన్న క్వార్టర్లను వారం లోపల శుభ్రం చేయించాలని ఆదేశించారు.