News October 17, 2025

ములుగుకు కేంద్రీయ విద్యాలయం మంజూరు: ఎంపీ

image

ములుగుకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. ములుగు ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ విద్యాలయాన్ని మంజూరు చేయించినట్లు తెలిపారు. మోడికుంటవాగు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ట్రైబల్ సెంట్రల్ వర్సిటీ పనులను వేగవంతం చేయిస్తామని చెప్పారు.

Similar News

News October 18, 2025

TODAY HEADLINES

image

➢ ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదు: ప్రధాని మోదీ
➢ ఉచిత ఇసుక అందరికీ అందాల్సిందే: CM CBN
➢ AP: TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పులు చేసే యోచనలో విద్యాశాఖ
➢ TG: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన హైకోర్టు.. 2 వారాలు సమయం కోరిన ప్రభుత్వం, ఈసీ
➢ కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు: CM రేవంత్
➢ రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ ఆడతారని చెప్పలేం: అగార్కర్

News October 18, 2025

భార్యకు మంత్రి పదవి.. గర్వంగా ఉందన్న జడేజా

image

తన భార్య రివాబా జడేజాకు గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కడంపై స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హర్షం వ్యక్తం చేశారు. ‘నీవు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నా. మంత్రిగా గొప్ప విజయాలు సాధిస్తావని ఆకాంక్షిస్తున్నా. జైహింద్’ అని ట్వీట్ చేశారు. కాగా రివాబాకు విద్యాశాఖను కేటాయించారు.

News October 18, 2025

KNR: ‘చట్టాలపై అవగాహన అవసరం’

image

తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.