News March 20, 2025

ములుగు: అటవీశాఖలో అవినీతి అధికారి

image

తునికాకు కూలీల బోనస్ డబ్బుల్లో చేతివాటం ప్రదర్శించిన అటవీశాఖ రేంజ్ అధికారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందితో పాటు పలువురి ఖాతాల్లో సుమారు రూ.25లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏడుగురు అమాయక సిబ్బందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బోనస్ డబ్బులు ‘బా’గానే ‘లా’గి ‘రాజు’ల తిరుగుతున్నాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

హసన్‌పర్తి: గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి శివారులో 2017లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురికి 8 సంవత్సరాల తర్వాత పదేళ్ల జైలు శిక్ష పడింది. నేరం రుజువుకావడంతో, నిందితులైన లావుడ్య భద్రమ్మ, దుప్పటి మల్లయ్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పునిచ్చారు.

News September 19, 2025

నల్గొండ: జిల్లాలో తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు

image

జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జులై, ఆగస్టు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య వెయ్యికి పైగా చేరాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం వందల సంఖ్యలో మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కార్లు, బైక్లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించింది. దీంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు.

News September 19, 2025

SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

image

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.