News March 5, 2025

ములుగు: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

నేడు ములుగు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదని తెలిపారు.

Similar News

News March 5, 2025

అర్హుల ఎంపికను పూర్తి చేయాలి: హనుమకొండ కలెక్టర్

image

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకానికి జిల్లాలో ఎంతమంది ఎంపికయ్యారని, ఎన్ని దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయనే, తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

News March 5, 2025

మెదక్: మహిళతో శారీరకంగా కలిసి.. చివరికి

image

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని మాయమాటలు చెప్పి గుమ్మడిదల కల్లు షాప్ నుంచి ఆమెను నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. శారీరకంగా కలసి, చున్నీతో ఆమె గొంతుకు చుట్టి ఉపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

News March 5, 2025

సంగారెడ్డి: మహిళతో శారీరకంగా కలిసి.. చివరికి 

image

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని మాయమాటలు చెప్పి గుమ్మడిదల కల్లు షాప్ నుంచి ఆమెను నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. శారీరకంగా కలసి, చున్నీతో ఆమె గొంతుకు చుట్టి ఉపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

error: Content is protected !!