News March 20, 2025
ములుగు కలెక్టర్ కీలక ఆదేశాలు

ములుగు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గురువారం పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు ఎలాంటి కరెంటు కోతలు ఉండవద్దన్నారు.
Similar News
News March 21, 2025
వరంగల్: భద్రకాళి చెరువు పనులను పరిశీలించిన మంత్రి

భద్రకాళి చెరువు పూడికతీత పనులను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, కెఆర్ నాగరాజు, గుండు సుధారాణి కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావిణ్య, కమిషనర్ అశ్విని తానాజీ తదితరులు పాల్గొన్నారు.
News March 21, 2025
యాదాద్రిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.. ఎన్నంటే..?

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా నల్గొండలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2,37,664 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో NLG మొదటి స్థానంలో ఉండగా.. 1,54,224 కనెక్షన్లతో సూర్యాపేట నాల్గో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,17,477 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్ల పరంగా చూస్తే.. నల్గొండ ఐదో స్థానంలో నిలిచింది.
News March 21, 2025
నాల్గో స్థానంలో సూర్యాపేట..!

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా నల్గొండలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2,37,664 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో NLG మొదటి స్థానంలో ఉండగా.. 1,54,224 కనెక్షన్లతో సూర్యాపేట నాల్గో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,17,477 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్ల పరంగా చూస్తే.. నల్గొండ ఐదో స్థానంలో నిలిచింది.