News December 7, 2025
ములుగు: కాంగ్రెస్లో కొనసాగుతున్న సస్పెన్షన్లు

పంచాయతీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్లో బహిష్కరణలు కొనసాగుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శనివారం పీఏసీఎస్ ఛైర్మన్ చిక్కుల రాములు, మాజీ సర్పంచ్ అహ్మద్ పాషా, మాజీ ఎంపీటీసీ అశోక్ను డీసీసీ అధ్యక్షుడు అశోక్ సస్పెండ్ చేశారు. ఆదివానం ములుగు మండలం పొట్లాపూర్కు చెందిన రాజ్ కుమార్, వెంకట్ రెడ్డి, పాపయ్యలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మండల అధ్యక్షుడు చాంద్ పాషా తెలిపారు.
Similar News
News December 8, 2025
రెచ్చగొట్టేలా జైశంకర్ వ్యాఖ్యలు: పాకిస్థాన్

విదేశాంగ మంత్రి జైశంకర్పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.
News December 8, 2025
ఊల వేసిన మడిలో నీరుంటుందా?

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 8, 2025
సిద్దిపేట: ఈ మండలంలో 6 సర్పంచులు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలోనే 38 గ్రామపంచాయతీలతో అతిపెద్ద మండలం అక్కన్నపేట. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలకు అక్కన్నపేట మండలం మూడో విడత ఎన్నికలకు ఎంపికైంది. మండలంలోని శ్రీరామ్ తండా, దుబ్బతండా, చౌడుతండా, దాసుతండా, గొల్లపల్లి, కుందనవానిపల్లి 6 గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండలంలో చాలా గ్రామాల్లో వార్డులు కూడా ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవ ఎన్నికల జరిగాయి.


