News July 9, 2025

ములుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధం

image

జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని, గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు గోదావరిలో చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజ్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసే జులై, ఆగస్టు మాసంలో చేపల వేట నిషిద్ధమని తెలిపారు. చెరువులు మత్తడి పోస్తున్నప్పుడు మత్తడి ప్రాంతంలో సిమెంటు దిమ్మెలు, ఇనుప జాలీలు, కర్రలు, వలలు పెట్టడం వల్ల చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు

Similar News

News July 10, 2025

విశాఖలో గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ ఏర్పాటు

image

విశాఖ కేంద్రంగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఇసాయ్ ఫార్మా గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం విశాఖలోని ఐటీ మౌలిక సదుపాయాలను సంస్థ నిపుణుల బృందం పరిశీలించింది. విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు తమ ప్రణాళికలను ఇసాయ్ ఫార్మా గ్లోబల్ CEO మెుకోటో హోకేట్సు వివరించారు.

News July 10, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు

News July 10, 2025

ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు చేయాలి: ఇంఛార్జి పీవో

image

ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయాలని ఐటీడీఏ ఇంఛార్జి పీఓ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో గ్రామ సచివాలయం, ఐసీడీఏస్ ఇతర అధికారులతో చిన్నారులకు ఆధార్, జనన దృవీకరణ పత్రాల జారీపై సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో 4,765 మంది పిల్లలకు ఆధార్ కార్డులు, 3,484 మందికి జనన దృవీకరణ పత్రాలు లేవన్నారు. ఈ నెలాఖరులోగా ఆధార్ జారీ చేయాలని సూచించారు.