News January 30, 2025

ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

image

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 13, 2026

​మూడు కార్పొరేషన్లు.. కో-ఆప్షన్ కొలువులో కొత్త లెక్క!

image

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో ఐదుగురు సభ్యులకే పరిమితమైన ఈ కోటా ఇప్పుడు ఆరుగురికి పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావాహులు ఆరా తీస్తుండగా, పాత లెక్కలు మారి కొత్త వారి ఎంట్రీకి మార్గం సుగమమైంది. పెరిగిన సభ్యుల బలంతో పాలనలో వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

News February 13, 2026

కొల్లాపూర్: పట్టు నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి

image

కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి పట్టు నిలబెట్టుకున్నారు. మొత్తం 19 వార్డులకు గాను 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు.

News February 13, 2026

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పనులు వేగవంతం

image

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు 24 గంటలూ పనులు చేస్తున్నారు. సుందరీకరణ పనులకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతానికి విగ్రహావిష్కరణ మాత్రమే మార్చి 16న జరుగుతుందని సమాచారం. మిగిలిన పనులు తర్వాత పూర్తి కానున్నాయి.