News February 7, 2025
ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ రె’ఢీ’

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, వివిధ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన ములుగు అసెంబ్లీ పరిధిలో 09 మండలాలు ఉండగా 09 జడ్పీటీసీ స్థానాలు, 09 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా కొన్ని మండలాల్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది.
Similar News
News October 22, 2025
సచిన్ను దాటేసేవాడిని.. మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ముందుగా ఛాన్స్లు వచ్చుంటే నా గణాంకాలు ఇంకోలా ఉండేవి. బహుశా సచిన్ కంటే 5 వేల పరుగులు ఎక్కువ చేసుండేవాడిని. అత్యధిక సెంచరీలు, యాషెస్, వరల్డ్కప్ గెలుపులు వంటివెన్నో నమోదయ్యేవి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హస్సీ 61 సెంచరీలు, 23వేల రన్స్ చేశారు. కానీ తీవ్ర పోటీ వల్ల 28 ఏళ్లకు AUS తరఫున అరంగేట్రం చేశారు.
News October 22, 2025
వర్షాలపట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: SP

జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలను చైతన్యపరస్తూ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం సూచించారు. వర్షం తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు చెరువులు, నదులు, వాగులను పోలీసులు సందర్శించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SP హెచ్చరించారు. ఏదైనా అత్యవమైతే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
News October 22, 2025
NLG: ఆ ఊరిలో ఒక్క బెల్టు షాపు లేదు

తిప్పర్తి మండలంలోని కాశివారిగూడెం గ్రామం ఒక్క బెల్టు షాపు కూడా లేని ఆదర్శంగా నిలిచింది. గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకమై గ్రామంలో మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించి, కఠిన చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా గ్రామం ప్రశాంతంగా, శుభ్రంగా మారింది. స్వచ్ఛమైన జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తున్న కాశివారిగూడెం గ్రామం, ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.