News February 24, 2026

ములుగు జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు

image

ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో 10 కేంద్రాలు సిద్ధం చేశామని కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. కలెక్టర్ కార్యాలయం మాట్లాడుతూ.. 1,981 మంది ప్రథమ సంవత్సరం, 1,860 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. చీటింగ్ నివారణకు స్క్వాడ్లు, కేంద్రాల వద్ద సెక్షన్ 163 (144) అమలు, జిరాక్స్ షాపులు మూసివేత, త్రాగునీరు–వైద్య సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

News February 28, 2026

జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు: DPRO

image

ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు డీపీఆర్వో సంపత్ కుమార్ తెలిపారు. పాత కార్డుల గడువు ఈనెల 28తో ముగియనున్న నేపథ్యంలో, జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత కార్డులే చెల్లుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

News February 28, 2026

NZB: అర్ధరాత్రి తల్లిని కాల్చి చంపాడు!

image

నిజామాబాద్ జిల్లా కోటగిరిలో అత్యంత కిరాతక ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్నతల్లిని ప్రాణాలతో ఉండగానే తగలబెట్టి హత్య చేశాడు. స్థానికుల వివరాలు.. బ్రాహ్మణగల్లికి చెందిన మానాజీ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి తల్లి భూమవ్వపై దాడి చేసి ప్రాణాలతో ఉండగానే ఇంట్లోని పాత బట్టలు వేసి నిప్పు పెట్టి కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.