News November 7, 2025

ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు

image

ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించారు. సర్వైకల్ క్యాన్సర్‌తో 27మంది, బోన్/లివర్ క్యాన్సర్‌తో 5మంది, బ్లడ్ క్యాన్సర్‌తో 9మంది, బ్రెస్ట్ క్యాన్సర్‌తో 70మంది, ఓరల్ క్యాన్సర్‌తో 33మంది, గొంతు క్యాన్సర్‌తో 18మంది, ఇతర క్యాన్సర్ లక్షణాలతో 83మంది బాధపడుతున్నారు. ‘ఈరోజు క్యాన్సర్ అవగాహన దినోత్సవం’.

Similar News

News November 7, 2025

అది పాకిస్థాన్‌ చరిత్రలోనే ఉంది: భారత్

image

అణ్వాయుధాలను <<18185605>>పరీక్షిస్తున్న<<>>దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రహస్య, చట్ట విరుద్ధ అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్ చరిత్రలోనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు. దశాబ్దాలపాటు స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు నిర్వహించిందని అన్నారు. ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నామన్నారు.

News November 7, 2025

HYD: ఎమ్మెల్సీ ఫోన్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు

image

MLC శంభీపూర్ రాజు ఫోన్‌ను దుండగులు హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. వ్యక్తిగత, అధికారిక సమాచారం భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, దుండిగల్ పోలీస్ స్టేషన్‌తో పాటు గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్‌పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

News November 7, 2025

WGL: Way2News ఎఫెక్ట్.. విచారణకు MGM సూపరింటెండెంట్ ఆదేశం

image

రోగుల దగ్గర <<18223340>>ప్రార్థనలు చేస్తున్నారంటూ<<>> Way2Newsలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై MGM సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి వెంటనే స్పందించారు. ఈ మేరకు విచారణకు ఆదేశించారు. రాత్రిళ్లు ఇతరులు ఎవరూ పేషంట్ల వద్దకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.