News February 4, 2025

ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బలరాం

image

బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా సిరికొండ బలరాంను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ కౌన్సిల్ సభ్యులుగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు భూక్యా జవహర్ లాల్‌ను నియమించింది. ఎస్టీ నియోజకవర్గమైన ములుగుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బలరామును అధ్యక్షుడిగా నియమించడం విశేషం.

Similar News

News March 1, 2026

రెండు రోజుల పాటు శ్రీవారి SSD టోకెన్లు రద్దు

image

AP: నేడు, రేపు శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా ఈనెల 2, 3 తేదీలకు సంబంధించిన SSD టోకెన్లను క్యాన్సిల్ చేసింది. మళ్లీ 4వ తేదీకి సంబంధించిన టోకెన్లను ఈనెల 3న జారీ చేస్తారు. ఇక 3న వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.

News March 1, 2026

కామారెడ్డి: ట్రిపుల్ సెంచరీ దాటిన చికెన్ ధరలు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో ఆదివారం చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరిగి ‘ట్రిపుల్ సెంచరీ’ని దాటాయి. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300 పలుకుతుండగా, లైవ్ కోడి రూ.190గా ఉంది. మటన్ కిలో రూ.800, బోటి రూ.400 చొప్పున విక్రయిస్తున్నారు. పెరుగుతున్న ధరలతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు.

News March 1, 2026

KTDM: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్’

image

భద్రాచలం వ్యాపారి కంభంపాటి శ్రీనివాస్ కుమారుడు జశ్వంత్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంబీఏ పూర్తి చేసిన జశ్వంత్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన అతను.. “నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్ వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని తన సోదరుడికి వాట్సప్‌లో మెసేజ్ పంపాడు. ఆందోళనతో కుటుంబ సభ్యులు గాలించగా, చివరకు నదిలో అతని మృతదేహం లభ్యమైంది.