News September 12, 2025
ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం

33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీఈ నాగేశ్వర్ రావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ములుగు, ఏటూరునాగారం, మంగపేటతో సహా పలు సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా ఉండదని ఆయన వివరించారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News September 12, 2025
అమరావతిలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్

భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ సౌకర్యం అమరావతిలో రానుంది. క్వాంటం వ్యాలీ “క్వాంటం క్రయోజెనిక్ కాంపోనెంట్స్” ప్రాజెక్ట్ను పొందనున్నట్లు తెలుస్తోంది. క్వాంటం వ్యాలీలో దీనిని అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ స్థాపించనుంది. దీని పెట్టుబడి సుమారు 200 కోట్లు అంచనా వేస్తున్నారు. 49.66 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రానున్నట్లు సమాచారం.
News September 12, 2025
అమరావతి ORR అప్డేట్

అమరావతి ORR అప్డేట్ వచ్చింది. 140 మీటర్ల వెడల్పుతో సవరించిన DPR ప్రతిపాదనలను రూ.25 వేల కోట్ల అంచనాతో MoRTH సాంకేతిక కమిటీకి పంపారు. ఐతే ఆమోదం పొందిన తర్వాత ఫైల్ PPP అంచనా కమిటీకి, చివరకు ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్కు తరలించబడింది. అమరావతి ORR పై రావడంతో ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని పెరిగింది.
News September 12, 2025
కడెం వరద గేట్లు ఎత్తే అవకాశం

కడెం పరివాహక ప్రాంతంలో( క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున శుక్రవారం రాత్రి కడెం ప్రాజెక్టు వరద గేట్లు నుంచి నీళ్లను వదిలే అవకాశం కడెం ప్రాజెక్టు నాల్గవ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు.
నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూడాలన్నారు. పశువుల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.