News November 18, 2025

ములుగు: డబ్బులు ఆడిగేందుకు వెళ్తే.. చంపారు!

image

యువతికి ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్తే వ్యక్తిని <<18308316>>కొట్టి చంపిన ఘటన<<>> ములుగు జిల్లాలో కలకలం రేపింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన సమ్మయ్య లాలాయిగూడెంకు చెందిన యువతికి రూ.4 వేలు ఇచ్చాడు. డబ్బుల కోసం తరచూ వేధిస్తున్నాడని ఆదివారం రాత్రి యువతి ఇంటికి వచ్చిన సమ్మయ్యను.. యువతి తాత, నానమ్మ కలిసి రేకుల షెడ్డు కింద కట్టేసి కొట్టారు. దింతో సమ్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.

Similar News

News November 18, 2025

దడ పుట్టిస్తున్న వానరాలు.. వేములవాడలో కోతులతో పరేషాన్

image

వేములవాడ ఆలయంలో కోతులు హల్‌చల్ చేస్తున్నాయి. పట్టణంలో కొంతకాలంగా కోతుల సంచారం ఎక్కువైంది. ముఖ్యంగా భక్తుల సంచారం అధికంగా ఉండే ఆలయ పరిసరాల్లో వానరాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఆలయ ముఖ్య బుకింగ్ కౌంటర్ క్యూలైన్లో కోతులు వాటికి కావాల్సిన ఆహారం కోసం అటుఇటు తిరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో కోతులు వస్తుండడంతో క్యూలైన్లలోని భక్తులు భయపడుతున్నారు.

News November 18, 2025

దడ పుట్టిస్తున్న వానరాలు.. వేములవాడలో కోతులతో పరేషాన్

image

వేములవాడ ఆలయంలో కోతులు హల్‌చల్ చేస్తున్నాయి. పట్టణంలో కొంతకాలంగా కోతుల సంచారం ఎక్కువైంది. ముఖ్యంగా భక్తుల సంచారం అధికంగా ఉండే ఆలయ పరిసరాల్లో వానరాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఆలయ ముఖ్య బుకింగ్ కౌంటర్ క్యూలైన్లో కోతులు వాటికి కావాల్సిన ఆహారం కోసం అటుఇటు తిరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో కోతులు వస్తుండడంతో క్యూలైన్లలోని భక్తులు భయపడుతున్నారు.

News November 18, 2025

ఎన్టీఆర్ జిల్లాలో భారీగా పంట నష్టం

image

మొంథా తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. 162 ఎకరాల్లో అరటి, కూరగాయలు, 2,360 ఎకరాలకు పైగా వరి, పత్తి దెబ్బతిన్నాయి. పంట నష్టంగా రైతులకు మొత్తం రూ.12.38 కోట్లు పరిహారం అందజేయాలని కోరుతూ సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.