News October 22, 2025
ములుగు: ‘డీసీసీ’ పీఠంపై అదే ఉత్కంఠ..!

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు నూతన అధ్యక్షుని ప్రకటన వెలువడే అవకాశముంది. ఆరుగురు సీనియర్ నాయకులు ఏఐసీసీ పరిశీలకుడికి దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్గా పని చేసిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ చేసిన ప్రకటన ఆలోచనలో పడేసింది. ఆ ఆరుగురు అధిష్ఠానం కరుణకోసం తీవ్రంగా తండ్లాడుతున్నారు.
Similar News
News October 22, 2025
కామవరపుకోట: పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య యత్నం

చిట్టీలు వసూల కాక ఆర్థికంగా ఇబ్బందులు పడిన ఓ మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కామవరపుకోట మండలం వీరిశెట్టి గూడెంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి వేసిన చిట్టీలు వసూలు కాక ఈ ఘాతుకానికి సిద్ధమైంది. కుటుంబీకులు ఆమెను ఓ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై తడికలపూడి ఎస్సై చిన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 22, 2025
జనగామ జిల్లాకు 16,628 అభ్యాస దీపికలు

పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా, ఉత్తీర్ణత సాధించేలా అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే అభ్యాస దీపికలను రూపొందించారు. జనగామ జిల్లాలోని కేజీబీవీ, జడ్పీ, మోడల్, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 3,600 మంది విద్యార్థులకు 16,628 పుస్తకాలను ముద్రించి అందజేశారు.
News October 22, 2025
WNP: ఆరోగ్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నవంబర్ 15వ తేదీ వరకు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభాకార్డుల జనరేషన్ ప్రక్రియను ఇంకా వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. అలాగే డెంగీ పరీక్షలను కొనసాగించాలని సూచించారు. ANMలతో ఎన్ సి డి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేయించాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.