News March 5, 2025
ములుగు: ‘నష్టపరిహారం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా’

తాడ్వాయిలో నకిలీ మొక్కజొన్న పంట వేసి ఓ రైతు తీవ్రంగా నష్టపోయారు. నర్సాపూర్ (పీఏ)కు చెందిన సీతారాములు అనే రైతు 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. పంట చేతికి వచ్చే సమయానికి మొక్కజొన్న పీచు మాత్రమే ఉందని, గింజలు లేవని నకిలీ మొక్కజొన్న ఇచ్చారని..సింజెంటా షీట్ ఏజెంట్లపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదన్నారు.తనకు నష్టపరిహారం చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.
Similar News
News September 16, 2025
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.
News September 16, 2025
పెద్దపల్లి: ‘మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి’

PDPLలో సెప్టెంబర్17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ-సశక్తి పరివార్ అభియాన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతిరోజు ప్రత్యేక వైద్య క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. బాలికల గురుకులాల్లో స్క్రీనింగ్ టెస్టులు, గర్భిణీలకు 100% ANC చెకప్, పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
జూబ్లీహిల్స్లో ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ ఫ్లెక్సీలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజు రోజుకూ రాజుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎవరికివారు టికెట్ తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా రావాలి అంజన్న.. కావాలి అంజన్న అంటూ అంజన్ కుమార్ యాదవ్కు అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఉప ఎన్నికల్లో ఆయనా టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసింది. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారాయి.