News November 19, 2025
ములుగు: పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు!

ములుగు జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 30 సెంటీగ్రేట్లకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రస్తుతం జిల్లాలో అత్యల్పంగా 11 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు చలి తీవ్రతలు ఎదుర్కొనేందుకు తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 19, 2025
HYD: సంస్థ అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరం: సీపీ

ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరమని సీపీ సజ్జనార్ అన్నారు. ‘ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం’ పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, ఈ శిక్షణ అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు.
News November 19, 2025
CM చేతుల మీదుగా ఇందిరమ్మ చీర అందుకున్న జిల్లావాసి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలకు అందజేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు పుష్పారాణి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ చీరను అందుకున్నారు. సీఎం చేతుల మీదుగా చీర అందుకోవడం తనకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
News November 19, 2025
NGKL: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సంబంధిత శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. జిల్లాలోని పలు మండలాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వెనుకబడి ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్పై బుధవారం సాయంత్రం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు.


