News March 21, 2025
ములుగు: పని పట్ల మంత్రి సీతక్క నిబద్ధత

ఎంతో పని ఒత్తిడి అసెంబ్లీ సమావేశాలున్నా శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకే ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయానికి మంత్రి సీతక్క చేరుకున్నారు. ఉదయం 9.45వరకు అధికారులతో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, తాగు నీటి పంపిణిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శాసన మండలికి చేరుకుని బడ్జెటపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
భద్రాచలంకు రూ.35 కోట్లు.. సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
News March 28, 2025
రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు వికారాబాద్ వాసి

సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు గోపి ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నేనావత్ పరశురాం నాయక్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 27, 30 తేదీలలో బిహార్ రాష్ట్రంలో నిర్వహించనున్న 34వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు గోపి ఎంపిక కావడంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
News March 28, 2025
సెలవు రోజుల్లోనూ పని చేయనున్న కార్యాలయాలు

దేశవ్యాప్తంగా ఈనెల 29, 30, 31 తేదీల్లో ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసులు పనిచేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా, ఆలోగా పన్ను చెల్లింపుదారులు పెండింగ్లో ఉన్న తమ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలవులున్నప్పటికీ కార్యాలయాలు పని చేస్తాయని CBDT తెలిపింది. అటు ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ 30, 31 తేదీల్లో పనిచేయనున్నాయి.