News October 27, 2025
ములుగు: ఫ్లాష్ ఫడ్స్ వస్తాయి.. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

వచ్చే రెండు రోజులు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు, అకస్మాత్తు వరదల ముప్పు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ దివాకర అన్నారు. జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు, ప్రజలకు సూచనలు చేశారు. కలెక్టరేట్లో అధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. లోతట్టు ప్రాంతాలలో ముందుస్తుగా రేషన్, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. సాయం కోసం 18004257109ను సంప్రదించాలన్నారు.
Similar News
News October 27, 2025
సంగారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి’

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. దీంతో పాటు సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు.
News October 27, 2025
NRPT: అకాల వర్షాలతో పంట నష్టం జరగకుండా చూడాలి

అకాల వర్షాలతో రైతుల పంటలు నష్టం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలెక్టర్లను ఆదేశించారు. హైద్రాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పత్తి, వరి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 27, 2025
కవిత కొత్తగా..

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.


