News April 3, 2025

ములుగు: బీజేపీ నాయకుడిపై పొక్సో కేసు

image

వెంకటాపురం BJP అధ్యక్షుడిపై పొక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం కూలీ పని కోసం బెస్తగూడెంకి వచ్చారు. MARCH 31న ఓ బాలిక బోరు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఇంటికి తీసుకెళ్తానని బైక్‌ ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్రమత్తమైన బాలిక దూకి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు PSలో ఫిర్యాదు చేశారు. 

Similar News

News September 15, 2025

లోక్‌సభలో 9 చర్చల్లో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ

image

లోక్‌సభలో(2024-25) ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఇందులో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ లోక్‌సభలో మొత్తంగా 61 ప్రశ్నలు అడిగారు. 9 చర్చల్లో పాల్గొన్నారు. 88.24 హాజరు శాతం కనబర్చారు.

News September 15, 2025

ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఏంతంటే?

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,555 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,400కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News September 15, 2025

NIRDPRలో 150 ఉద్యోగాలు

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్‌‌(NIRDPR)లో 150 ఎన్యూమరేటెర్ పోస్టులున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. 45 ఏళ్ల లోపు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన, పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>http://career.nirdpr.in/<<>>