News January 3, 2026
ములుగు: భారీ ఎన్ కౌంటర్.. 14 మంది మావోలు మృతి

ఛత్తీస్గఢ్ జరిగిన రెండు వేర్వేరు చోట్ల భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు 14 మంది నక్సలైట్లను హతమార్చాయి. సుక్మాలోని కిష్టారామ్ ప్రాంతంలో 12 మంది, బీజాపూర్లో ఇద్దరు మృతి చెందారు. బీజాపూర్లో మృతి చెందిన ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని, రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు ధ్రువీకరించారు.
Similar News
News January 4, 2026
BCB రిక్వెస్ట్.. శ్రీలంకలో బంగ్లా మ్యాచులు!

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఇరు దేశాల మధ్య <<18748860>>క్రికెట్పై<<>> ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో T20WCలో తమ మ్యాచులు భారత్ నుంచి మార్చాలని BCB రిక్వెస్ట్ చేసింది. దీనిపై ICC సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్లో భారత్లో జరగాల్సిన బంగ్లా మ్యాచులను శ్రీలంకకు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే 48గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రిక్ బజ్ పేర్కొంది.
News January 4, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

♦︎బారువ హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
♦︎SKLM: 108పై దుష్ప్రచారాలు మానుకోవాలి
♦︎దేశంలో మొదటిసారిగా ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: అచ్చెన్న
♦︎టెక్కలి: మద్యం మత్తులో చనిపోతానంటూ వ్యక్తి హల్చల్
♦︎కంచిలి: రైలు పైకెక్కి వ్యక్తి హల్చల్
♦︎ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం పడింది: రామ్మెహన్
♦︎ పొందూరులో నూతన డీటీఎఫ్ కార్యవర్గం ఎంపిక
News January 4, 2026
కర్నూలులో కడుపుబ్బా నవ్వించిన జబర్దస్త్ టీమ్

కర్నూలులో జబర్దస్త్ టీమ్ కడుపుబ్బ నవ్వించారు. ఆదివారం టీజీవి కళాక్షేత్రంలో 2026 సంవత్సరం మొదటి ప్రదర్శనగా జబర్దస్త్ కామెడీ షోను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, విద్యావేత్తలు కేవీఎన్ రాజశేఖర్, పుల్లయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంవత్సరం మొత్తం శ్రోతలకు ఆనందం, వినోదం అందించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.


