News March 6, 2025
ములుగు: మావోయిస్టు కొరియర్ల వివివరాలు

వెంకటాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడిసే అనిల్, కుర్హమి భామన్, మాడవి సుక్కు, సోడి ఇడుమల@చారి వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారన్నారు. మావోయిస్టు పార్టీకి దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బూట్లు అందజేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
Similar News
News March 6, 2025
పాల్వంచ: లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు

పాల్వంచ టౌన్ శ్రీ నిలయం అపార్ట్మెంట్లో సునీల్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్లో మహిళల ఫొటోలు తీస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వాచ్మెన్ & లాండ్రీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నంద్యాల వెంకటేశ్వర్లు అన్నారు. అపార్ట్మెంట్లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి గురువారం ఫిర్యాదు చేశారు. ఓ వాచ్మెన్ భార్యతో కూడా ఇలాగే వ్యవహరించాడని వారు తెలిపారు.
News March 6, 2025
ఘోర ప్రమాదాలు.. 10 మంది మృతి

AP వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి జరిగిన 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. HYD నుంచి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఏలూరు(మ) సోమవరప్పాడులో లారీని ఢీకొని ముగ్గురు చనిపోయారు. చిత్తూరు ఇరువారం జంక్షన్ వద్ద బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు, విశాఖ కంచరపాలెంలో చెట్టును బైక్ ఢీకొట్టి ఇద్దరు, నిన్న రాత్రి గువ్వలచెరువు ఘాట్లో కారును తప్పించబోయి లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందారు.
News March 6, 2025
NZB: MLC ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.