News March 26, 2025
ములుగు: రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ సంపత్ రావు తెలిపారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో ఔత్సాహికులు, రక్తదాతలు పాల్గొంటున్నారని తెలిపారు. కాగా జిల్లాలోని యువత, ఉద్యోగులు, పాత్రికేయులు, రక్తదాతలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 29, 2025
అన్నమయ్య: బాలుడిపై అఘాయిత్యం.. వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేశ్ బాలుడికి మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News March 29, 2025
మేనేజర్గా పనిచేస్తున్న క్రేజీ హీరోయిన్

యువీతో డేటింగ్, ఖడ్గం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన క్రేజీ హీరోయిన్ కిమ్ శర్మ గుర్తుందా? ప్రస్తుతం ఆమె బాలీవుడ్ పార్టీల్లో తరచూ కనిపించే ఓర్రీకి చెందిన ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీకి మేనేజర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీని ₹10Cr లాభాల్లోకి తీసుకొచ్చారు. షారుఖ్, అమితాబ్ లాంటి స్టార్లతో నటించిన ఆమె మేనేజర్గా చేస్తుండటంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
News March 29, 2025
GSWS అంశాల పెండింగ్ పూర్తిపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

GSWS అంశాల పెండింగ్ను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో GSWS, హెల్త్, తదితర అంశాలపై DPO, RDO, DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. GSWS పరిధిలో సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్ తక్కువ కాకూడదన్నారు.