News April 8, 2025
ములుగు: ‘వేసవి క్రీడల శిక్షణకు దరఖాస్తు చేసుకోండి’

ములుగు జిల్లాలో మే 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలలో 14 ఏళ్ల బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి తెలిపారు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం అందజేస్తామని, ఆసక్తి గల వారు ఈ నెల 15లోగా జిల్లా సంక్షేమ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 28, 2026
పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య దశాబ్దాల గొడవలకు 1893 నాటి ‘డ్యూరాండ్ లైన్’ సరిహద్దు ఒప్పందమే మూలం. పష్తూన్ ప్రజలను రెండుగా విడగొట్టిన ఈ రేఖను తాము గుర్తించబోమని అఫ్గాన్ మొదటి నుంచీ వాదిస్తోంది. దీనికి తోడు ఇస్లామిక్ పాలనే లక్ష్యంగా పాక్లో విధ్వంసం సృష్టించే ‘Tehreek-e-Taliban Pakistan’ ఉగ్రవాదులకు అఫ్గాన్ గడ్డపై ఆశ్రయం లభిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఇవే ఇరు దేశాల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు.
News February 28, 2026
NGKL: అంతుచిక్కని కుమ్మెర ఘటన

కుమ్మెర ఘటన రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న కాంగ్రెస్ నేతల బృందం గ్రామంలో పర్యటించింది. ఘటనపై NHRC సీరియస్ అయింది. అనేక మలుపులతో అంతుచిక్కని ఈ కేసు చివరకు ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.
News February 28, 2026
రాష్ట్రంలో ఖమ్మం ఫస్ట్.. 30వ స్థానంలో భద్రాద్రి

ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా, వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోదై రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. పీఎం కిసాన్ సహా కేంద్ర పథకాల లబ్ధికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు సూచించారు.


