News April 15, 2025
ములుగు: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, ములుగు జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
Similar News
News April 17, 2025
NGKL: టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యలపై డీఆర్డీవోకు వినతి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేశ్కు జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల యూనియన్ తరఫున టీఏలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. జిల్లాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై దినసరి వేతనంపై మండలాల్లో పనిచేసిన సిబ్బంది దృష్టి పెట్టాలని డీఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్, బాలయ్య, రాజేశ్ కుమార్, పాల్గొన్నారు.
News April 17, 2025
నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

☞మాదకద్రవ్యాల నిర్మూలనకు QR కోడ్: ఎస్పీ
☞పద్మ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం: DSO రాజు
☞డోన్ మండలంలో బాలికపై అత్యాచారం
☞గిరిజనులకు సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
☞పవన్ కళ్యాణ్ కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు.. గూడూరు యువకుల అరెస్ట్.
NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.
News April 17, 2025
VKB: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✔అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు✔భూభారతిపై అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔‘రజతోత్సవ సభకు తరలిరండి’:BRS✔దోమ వాసికి గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు✔IPL బెట్టింగ్. జర జాగ్రత్త: ఎస్ఐలు✔పలుచోట్ల డ్రగ్ అండ్ డ్రైవ్✔పరిగి: 100ఏళ్ల పురాతన భవనాలను పరిశీలించిన కలెక్టర్✔వికారాబాద్: పాఠశాలలో పెచ్చులూడి గాయపడిన బాలిక