News November 9, 2025

ములుగు: Way2Newsలో వరుస కథనాలు.. స్పందించిన సీతక్క

image

ములుగు(D) కన్నాయిగూడెంలో <<18239952>>పాముకాటుతో బాలుడు<<>> హరినాద్ స్వామి(7) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై Way2News ప్రచురించిన వరుస కథనాలకు మంత్రి సీతక్క స్పందించారు. వైద్యం అందక బాలుడు మృతి చెందినట్లు బంధువుల ఆరోపణతో వైద్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మృతికి కారణమైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యులతో పాటు, అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 9, 2025

10న ఏలూరుకు కేంద్ర బృందం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర బృందం ఈ నెల 10న ఏలూరు జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు బృందం ఉంగుటూరు చేరుకుంటుంది. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి, పునరుద్ధరణ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సమీక్షిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 9, 2025

NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్‌నాథ్ సింగ్

image

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.

News November 9, 2025

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

image

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరు పెట్టి వచ్చే యాడ్స్, వాట్సాప్/ ఇన్‌స్టాగ్రామ్/ టెలిగ్రామ్ లింక్స్‌‌ను నమ్మవద్దు అన్నారు. తక్కువలో ఎక్కువ లాభాలు వచ్చే వాగ్దానాలు కచ్చితంగా మోసం చేసేందుకే అన్నారు. లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత APK/ఫైళ్ళు ఇన్‌స్టాల్ చేయవద్దని, OTP, UPI PIN వంటివి చెప్పొద్దన్నారు.