News November 25, 2025

ములుగు:5 నిమిషాల్లో లోన్.. మోసపోకండి

image

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ములుగు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. 5 నిమిషాల్లో లోన్ ఇస్తామని చెప్పగానే మోసపోవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయొద్దని సూచించారు. ఆన్లైన్లో ఆధార్, పాన్ కార్డ్ పంపించొద్దని, ఫోను ద్వారా ఎలాంటి యాక్సెస్ ఇవ్వద్దని హెచ్చరించారు. మీ అవసరమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి అన్నారు. జాగ్రత్తలు వహించాలన్నారు.

Similar News

News November 25, 2025

పెద్దపల్లిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం

image

RGM సీపీ ఆదేశాలపై PDPLలోని ఒక కాలేజీలో పెద్దపల్లి షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఇన్‌ఛార్జ్ SI లావణ్య మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. వేధింపులపై 6303923700, సైబర్ మోసాలపై 1930, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలన్నారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో రెగ్యులర్ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 25, 2025

పెండింగ్ దరఖాస్తులు వెంటనే సమర్పించండి: కలెక్టర్

image

PDPL కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయని ఎస్సీ విద్యార్థులను గుర్తించి వెంటనే https://telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తులు DEC 31లోపు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల హార్డ్‌ కాపీలు, బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను పూర్తిచేసి SC అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News November 25, 2025

పెగడపల్లి: 10,853 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

image

పెగడపల్లి మండలంలో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మహిళా సంఘాలకు రూ.304 కోట్లు, జగిత్యాలలో 11,825 సంఘాలకు రూ.10.69 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు 10,853 ఇళ్లు మంజూరై అర్హులకు రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.