News December 16, 2025
ముస్తాబాద్: ఎన్నికలు.. పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా 730 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే మండలాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
Similar News
News December 19, 2025
నేషనల్ మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్కు 3,488 ఎకరాలు: CBN

AP: తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నేషనల్ మెగాషిప్ బిల్డింగ్, రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని CM CBN కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ను కోరారు. ‘దీనికి అవసరమైన 3,488 ఎకరాలు కేటాయిస్తాం. టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. వెంటనే అనుమతివ్వండి’ అని కోరారు. ఫేజ్1లో ₹1361.49 కోట్లతో 4 హార్బర్ల పనులు చేపట్టామని, వాటికి కేంద్రం నుంచి రావలసిన నిధులివ్వాలని విన్నవించారు.
News December 19, 2025
UIIC 153 పోస్టులకు నోటిఫికేషన్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (<
News December 19, 2025
వాజేడు: నాలుగు కాళ్ల కోడి పిల్ల

వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో నాలుగు కాళ్లతో ఉన్న కోడి పిల్ల బయటకు వచ్చింది. అదే కోడి గుడ్ల నుంచి పుట్టిన మిగతా కోడి పిల్లలు సాధారణంగానే ఉండగా, ఒక్క పిల్ల మాత్రం 4 కాళ్లతో కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. పలువురు తమ ఫోన్లలో దృశ్యాన్ని బంధించారు.


