News February 10, 2025
ముస్తాబాద్: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

ముస్తాబాద్ మండలంలోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి నామాపూర్, మొర్రపూర్, సేవాలాల్ గ్రామాలలో దాడులు నిర్వహించగా 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News November 14, 2025
ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్కు సిద్ధమయ్యారు.
News November 14, 2025
టీచర్లందరికీ టెట్ కంపల్సరీ.. విద్యాశాఖ ఉత్తర్వులు

తెలంగాణలో ఇకపై ఇన్-సర్వీస్ టీచర్లు కూడా <<18277875>>టెట్<<>> క్వాలిఫై అయి ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు సర్వీస్లో ఉండాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 2009 తర్వాత నియమితులైన 30 వేల మంది టీచర్లకు ఈ నిబంధన వర్తించనుంది. రానున్న 2 ఏళ్లలో వీరంతా టెట్ పాస్ కావాలని అధికారులు తెలిపారు.
News November 14, 2025
తెలంగాణ రౌండప్

* ఈ నెల 17 నుంచి 22 వరకు సర్కారు స్కూళ్లను తనిఖీ చేయనున్న ఉన్నతాధికారులు.. సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించనున్న స్పెషల్ అధికారులు
* చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి తొలగించిన 1,300 మంది ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి
* సమ్మె కారణంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం..


