News February 3, 2025

ముస్తాబాద్: వైన్స్ పర్మిట్‌ రూమ్‌లో వ్యక్తి హఠన్మారణం

image

ముస్తాబాద్‌లోని కొత్త బస్టాండ్ సమీపంలోని వైన్ షాపు పర్మిట్ రూమ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సోమవారం హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నామాపూర్‌కు చెందిన తేపూరి నారాయణ(50) ఆదివారం రోజంతా పనిచేసి రాత్రి అక్కడే పర్మిట్ రూంలోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచాక పర్మిట్ రూంలోనే హఠాత్తుగా కిందపడి చనిపోయాడు. మృతునికి అతిగా మద్యంతాగే అలవాటు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 13, 2026

ప్రజా సేవలోనే ప్రాణ త్యాగం.. నేడు శ్రీపాదరావు వర్ధంతి

image

గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎదిగిన శ్రీపాదరావు ప్రజాసేవలోనే ప్రాణత్యాగం చేశారు. 1999, ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో అప్పటి పీపుల్స్ వార్‌ నక్సలైట్లు శ్రీపాదరావును కాల్చి చంపడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ సంఘటన జరిగి 27 ఏళ్లు గడిచాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు శ్రీపాదరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

News April 13, 2026

200 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులో జైలు: ఎస్పీ

image

మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లతో పాటు జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షలు వేసినట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాహన చట్టాలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News April 13, 2026

జగిత్యాల రాజకీయం వేరే లెవెల్..!

image

JGTL రాజకీయాలు వేరే లెవెల్ అని చెప్పవచ్చు. MLC రమణ, మాజీ జడ్పీ ఛైర్మన్ దావ వసంత ఇప్పటికే BRSలో ఉండగా, తాజాగా జీవన్ రెడ్డి చేరుతున్నారు. ఇక MLA సంజయ్ ఇంకా BRSలోనే ఉన్నా పార్టీ మారలేదు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని అంటున్నారు. శాసనసభ స్పీకర్ కూడా సంజయ్ పార్టీ మారలేదని చెప్పారు. కాబట్టి, జగిత్యాల ముఖ్య నాయకులంతా టెక్నికల్‌గా BRSలోనే ఉన్నారు. కాంగ్రెస్ మొత్తం ఖాళీగా ఉన్నట్లే.