News February 21, 2025

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది: కిషన్ రెడ్డి

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జారుతున్నాయని, ఆ  స్థానాల్లో బీజీపీ పోటీ చేస్తుందని, ఈ మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 22, 2025

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

image

☛ కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ ☛ శ్రీశైలం యాత్రకు 24 గంటలు అనుమతి ☛ ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్ ☛ ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించాలి: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ☛ భర్త పురుగు మందు తాగాడని పోలీసులకు ఫోన్☛ గ్రూప్ – 2 పరీక్షలకు ఏడు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ ☛ చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం ☛ గ్రూప్-2 మెయిన్స్ వ్రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

News February 22, 2025

ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

image

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT

News February 21, 2025

కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

image

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్ట‌ర్‌ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.

error: Content is protected !!