News December 23, 2025
మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
Similar News
News December 23, 2025
ఢిల్లీకి చేరువలో HYD పొల్యూషన్

HYDలో ఎయిర్ క్వాలిటీ ఢిల్లో పరిస్థితి దగ్గరలో ఉంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 300 ఉండగా.. నగరంలో డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 270కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం మేలని, చిన్న పిల్లలను దీని నుంచి కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News December 23, 2025
మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. అర్చకులు, వేద పండితులు అమ్మవారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో అభిషేకించారు. మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
News December 23, 2025
కోటి రూపాయల మోసం.. పంజాగుట్టలో కేసు నమోదు

బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ వద్ద కోటి రూపాయల మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అత్తాపూర్కు చెందిన వ్యక్తిని నమ్మించి కోటికి పైగా నగదు దోచుకున్నారు. లాభాలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పార్కింగ్లో నగదు తీసుకొని కేటుగాడు పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


