News July 4, 2024

మూడు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

image

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

Similar News

News February 16, 2026

నల్గొండ: MIMలో చేరిన కార్పొరేటర్

image

నల్గొండ పురపాలక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొయినా భాయ్ హైదరాబాద్‌లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో MIM తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 107 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు తిరిగి పతంగి గూటికి చేరారు.

News February 15, 2026

నల్గొండ: గ్రామీణ ప్రతిభకు ‘సీఎం కప్’ వేదిక: కలెక్టర్

image

గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ‘సీఎం కప్’ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఈ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. సరైన వేదికలు లేక వెనుకబడుతున్న గ్రామీణ క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశమని, పట్టుదలతో ఆడి జిల్లాకు కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News February 15, 2026

NLG: అంగన్వాడీలపై ఇక పటిష్ఠ నిఘా

image

అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఆయా కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలతో పాటు ప్రీస్కూల్, పోషకాహార పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ కమిటీలు నిత్యం పర్యవేక్షించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండున్నరేళ్లుగా గ్రామాల్లో సర్పంచులు లేక గతంలో ఉన్న కమిటీలు అంతగా పనిచేయ లేదు.