News March 20, 2026

మూసీ ‘మెగా’ ప్లాన్.. నిధులన్నీ భూసేకరణకే!

image

మూసీ ప్రక్షాళన కోసం బడ్జెట్‌లో రూ.7,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సర్కారు ప్రకటించనుంది. సింహభాగం నిధులు నది శుద్ధి కోసం కాకుండా నిర్వాసితుల పరిహారం కోసమే ఖర్చు చేయబోతున్నారు. సుమారు 1,435 అక్రమ కట్టడాలను తొలగించేందుకు హైడ్రాకు ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. బడ్జెట్ అంకెల్లో మూసీ పేరు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వాసితుల గొంతుక వినిపించకుండా జాగ్రత్త పడుతోంది సర్కారు!

Similar News

News April 5, 2026

MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

image

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్‌కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

News April 5, 2026

పేదల న్యాయం కోసం జగ్జీవన్ రామ్ కృషి: ఎస్పీ స్నేహ మెహ్రా

image

బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అందరికీ సమానత్వం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పనిచేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.

News April 5, 2026

జగన్ అబద్ధం ఆడుతున్నారు: TDP

image

AP: రాజధాని అమరావతిలో చదరపు అడుగుకు రూ.12,000 ఖర్చవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నారని TDP ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అలా అనుకున్నా విలాసాలకు ఆయన కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ చ.అడుగుకి రూ.35,714 అయ్యిందని విమర్శించింది. దీనికి జగన్ ఏమని జవాబు చెబుతారని ప్రశ్నించింది. ఇక అబద్ధంతో బతుకుతూ, విద్వేషం చిమ్ముతూ అమరావతి విషయంలో ఒక్కడినే ఇంకో వైపు అనుకోవటం మానసిక స్థితిని తెలియజేస్తుందని ఎద్దేవా చేసింది.