News September 9, 2025

మృతుడి జేబులో నాలుగు సెల్ ఫోన్లు..వీడని మిస్టరీ

image

ఇరగవరం మండలం అయినపర్రు గ్రామ శివారులో పంటచేలలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ వీడలేదు. సోమవారం సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే మృతుడు జేబులో నాలుగు సెల్ ఫోన్లు ఉండడం, మృతదేహం కుళ్లిన దశలో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇరగవరం ఎస్ఐ జానా సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 9, 2025

నరసాపురం వరకు వందేభారత్ రైలు పొడిగింపునకు లేఖ

image

వందే భరత్ రైలు సర్వీస్‌ను చెన్నై – విజయవాడ నుంచి భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు రైల్వే కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ CM రమేష్‌కు లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు పొడిగింపు వల్ల రవాణ వేగం పెరుగుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగ పడుతుందని లేఖలో రాసినట్లు తెలిపారు.

News September 9, 2025

ఆలయంలో అగ్నిప్రమాదంపై ఎస్పీ విచారణ

image

మొగల్తూరులోని శ్రీ నడివీధి ముత్యాలమ్మ ఆలయ దహనానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా నేర పరిశోధనలో నిపుణులైన FSL బృందం, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక భద్రతా బృందాలు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాయన్నారు. తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

News September 9, 2025

పదవి వద్దంటూ చంద్రబాబుకి అంగర లేఖ

image

రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మెహనరావును నియమిస్తూ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబుకు రామ్మెహనరావు లేఖ రాశారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఎన్నో పదవులు చేసిన తాను కార్పొరేషన్ డైరెక్టర్ పదవి తీసుకోవడానికి సుముఖంగా లేనని, తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు, లోకేశ్‌ల నాయకత్వంలో పనిచేస్తానని పేర్కొన్నారు.