News September 25, 2025
మెగా డీఎస్సీ ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశం

పామర్రులోని ప్రగతి కాలేజీలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ బాలాజీ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ప్రతి ఒక్కరూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News September 27, 2025
ఈ పంట నమోదలో ఆలస్యం వద్దు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో ఈ-పంట నమోదు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 27, 2025
కృష్ణాజిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. ఫేక్ జర్నలిస్టుల మోసాలకు చెక్

జర్నలిజం ముసుగులో సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ఆటకట్టించేందుకు కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వారిచే జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్లు కలిగి ఉన్న జర్నలిస్టులకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఫేక్ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడే వారి ఆటకట్టించేందుకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
News September 27, 2025
మచిలీపట్నం: ‘సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి’

జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో సమావేశమై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో CM చర్చించిన అంశాలపై సమీక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల్లో పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు.