News November 11, 2025
మెట్పల్లి: తండ్రిని హత్య చేసిన కుమారుడి అరెస్టు

మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఎల్లగంగ నరసయ్య(74)ను హత్య చేసిన ఆయన కుమారుడు ఎల్ల అన్వేష్(32)ను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. తండ్రి పెళ్లి చేయలేదని, ఏదైన పనిచేయమని ఒత్తిడి చేయడంతోనే హత్యకు పాల్పడినట్లు వివరించారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, మొబైల్ ఫోన్, ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
రాజ్కోట్ నుంచి మహబూబ్నగర్కు పీయూ ఎన్ఎస్ఎస్ బృందం

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో విజయవంతంగా నిర్వహించిన ప్రీ రిపబ్లిక్ డే నేషనల్ క్యాంప్ను పూర్తి చేసుకుని, పీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బృందం మంగళవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్నగర్కు బయలుదేరింది. ఈ బృందం మంగళవారం రాత్రి కాచిగూడ చేరుకుంటుందని పీయూ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్, డా.కె.కవిత కంటింజెంట్ లీడర్లుగా, పలువురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
News November 12, 2025
MBNR: ‘సైబర్ కేసులను త్వరగా పరిష్కరించండి’

మహబూబ్నగర్ జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అదనపు ఎస్పీ ఎన్.బీ.రత్నం ఆదేశించారు. జిల్లా SP డి.జానకి ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం సైబర్ వారియర్స్తో సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ అదాలత్ నేపథ్యంలో కేసులు పరిష్కరించే ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
News November 12, 2025
ఎల్లుండి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

AP: టెన్త్ పరీక్షల ఫీజును ఎల్లుండి(NOV 13) నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. రెగ్యులర్, ఒకేషనల్, గతంలో టెన్త్ ఫెయిలైన వారు ఫీజును చెల్లించవచ్చని పేర్కొంది. లేట్ ఫీ రూ.50తో డిసెంబర్ 3 వరకు, రూ.200తో డిసెంబర్ 10 వరకు, రూ.500తో డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. స్కూల్ హెడ్ మాస్టర్లు https://bse.ap.gov.in/లో స్కూల్ లాగిన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.


